కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పన్నుల వసూళ్లను వేగవంతంగా నిర్వహించి, రాష్ట్రంలో మొదటి స్థానం సాధించింది. ఈ క్రమంలో పెనమలూరు మండలం పోరంకి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మున్సిపల్ సిబ్బందిని శనివారం అభినందించారు. తాడిగడప మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న ప్రజలు సకాలంలో ఆస్తి పన్నులు చెల్లించి, మొదటి స్థానంలో నిలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు.