SKLM: మందస మండలం పిడి మందసలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈమేరకు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో లభించే ఉచిత సదుపాయాలు, నాణ్యమైన బోధన గురించి వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడికి పంపి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. పాఠశాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు.