కోనసీమ: మీ భూమి మీకే సొంతం, ఆ భూమిపై మరెవ్వరికీ హక్కు లేదు అని చాటడానికి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో ఆదివారం జరిగిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు.