PLD: రొంపిచర్లను అభివృద్ధి చేసి చూపించామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రొంపిచర్లలో పర్యటించి మాట్లాడారు.. 2004కు ముందు ఈ ప్రాంతంలో తీవ్ర బాంబుదాడులు జరిగేవని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయన్నారు. ‘నేను ఎమ్మెల్యే అయ్యాక శాంతిని నెలకొల్పానని’ చెప్పుకొచ్చారు.