NLR: టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రత్యేక కృషితోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సాధ్యమైందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణపట్నం నుంచి ఓడరేవు మధ్య హార్బర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాత జీవోలను రద్దు చేయించి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి రూ.288.80 కోట్ల నిధులు మంజూరు చేయించామని ఆయన వివరించారు.