KRNL: పెద్దకడబురుకి చెందిన బొగ్గుల దేవన్న అనే రైతుకు చెందిన సుమారు 4 ఎకరాల వరిగడ్డి ఇవాళ అగ్నికి ఆహుతి అయింది. ఎవరు లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు వాపోయారు. కళ్లెదుటే మూగజీవాలకు ఆహారంగా నిల్వ ఉంచిన వరిగడ్డి బూడిద కావడంతో రైతు బొరున విలపించాడు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు.