KKD: కరప మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జె. శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి సత్తిబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఎజెండాతో పాటు ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని, మండల స్థాయి అధికారులు పూర్తి సమాచారంతో రావాలన్నారు.