PPM: చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ అధికారులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం వీరఘట్టం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన ప్రకృతి వ్యవసాయం బృందం ఏర్పాటు చేసిన చిరుధాన్యాల చక్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల ప్రాంగణాల్లో చిరుధాన్యాలు సాగును చేపట్టాలని అధికారులను ఆదేశించారు.