విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానంలో చైత్ర బహుళ అమావాస్య (గంధం అమావాస్య) సందర్భంగా శనివారం భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని ఈఓ జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచే భక్తులు కొండదిగువ వరాహ పుష్కరిణి వద్ద, కొండపై జాగారం చేసి, అమావాస్య రోజు స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకునే ఆనవాయితీ కొనసాగుతుందన్నారు.