ప్రకాశం: కొమరోలు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ నిర్వహించబడుతుందని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.