KDP: పులివెందుల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె గ్రామ పొలాల్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. రైతు సాయిలీల, గంగరాజులకు చెందిన అరటి తోటల్లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పులివెందుల అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అరటి పంటతో పాటు డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. సుమారు రూ. 2.70 లక్షల మేర నష్టం వాటిల్లింది.