KDP: కమలాపురంలోని పెద్ద చెప్పలిలో వెలసిన ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మవారు పులి వాహనంపై గ్రామ వీధుల్లో విహరించారు. అంతకు ముందు అమ్మవారిని ఆలయ అర్చకులు అత్యంత శోభాయమానంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.