KRNL: వేసవిలో నియోజకవర్గ పరిధిలో గడ్డి వాములు అగ్ని ప్రమాదానికి గురవుతుండటం వల్ల పశువులకు మేత కరవవుతోందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. పత్తికొండ అగ్నిమాపక కేంద్రంలో శుక్రవారం నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అగ్నిమాపక అధికారులు సరైన సమయంలో స్పందించి, మంటలను ఆర్పి వేస్తున్నారంటూ వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రీజినల్ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.