BDK: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యచరణలో భాగంగా నేడు అరైవ్- అలైవ్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్లకు రహదారి భద్రతా, ట్రాఫిక్ నియమాలపై సీఐ ప్రతాప్ అవగాహన సదస్సు నిర్వహించారు.