నల్గొండ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ఎంజీయూ పరిధిలోని కళాశాలల పనివేళలను మారుస్తున్నట్లు వీసీ హుస్సేన్ తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. పీజీ నాలుగో సెమిస్టర్ విద్యార్థులకు మే 15 వరకు తరగతులు పూర్తి చేసి, వెంటనే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.