ఏలూరు: రూరల్ కలపర్రు టోల్ ప్లాజా వద్ద తెల్లవారుజామున పోలీసులు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు నిద్ర మత్తులో డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో వివరించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. అలసట అనిపిస్తే సురక్షితమైన ప్రదేశాలలో వాహనాలు నిలిపి విశ్రాంతి తీసుకోవాలన్నారు. హైవే పై ప్రయాణించేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.