కృష్ణా: గన్నవరం మండలం ముస్తాబాదులో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక మాట్లాడారు. పత్రికల విలువలను దిగజార్చి, అసభ్యంగా మాట్లాడే స్థాయికి దిగజారిన ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. మాజీ సీఎం జగన్ కుటుంబంపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.