GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. అర్జీలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.