20 ఏళ్ల తర్వాత రిలయన్స్ నుంచి జియో ఐపీవో వస్తోంది. సుమారు రూ.40,000 కోట్లు సేకరించడమే లక్ష్యంగా మే నెలలో సెబీకి పత్రాలు సమర్పించనున్నారు. జియో విలువను రూ.15.78 లక్షల కోట్లుగా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల వాయిదా పడ్డ ఈ మెగా ఇష్యూ కోసం ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.