NLR: మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా కందుకూరులోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. MLA ఇంటూరి నాగేశ్వరరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. సావిత్రీబాయి పూలేతో కలిసి మహిళా విద్యకు ఆయన శ్రీకారం చుట్టారని గుర్తుచేస్తూ, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.