W.G: నరసాపురంలో కళాశాలలో శుక్రవారం మహిళా రక్షణ చట్టాలు, కెరీర్ గైడెన్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గన్నాబత్తుల సత్యవతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ జయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. విద్యార్థినులు సోషల్ మీడియాలో అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను పంచుకోకూడదని సూచించారు.