TPT: నాగలాపురం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా టీజే ప్రణీత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సత్తివేడు నియోజకవర్గ పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆశీస్సులతో అధ్యక్ష పదవి వచ్చిందని, ఇందుకు సహకరించిన పార్టీ నాయకులకు ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.