గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం (CDE) పీజీ కోర్సుల ప్రవేశ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి anucde.info వెబ్సైట్లో ఫారం లింక్ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు దరఖాస్తు చేయని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని CDE డైరెక్టర్ సూచించారు.