HYD: జూబ్లీహిల్స్ సొసైటీలో వరద కాలువలను పూడ్చి, ప్లాట్లుగా చేసి విక్రయించారు. అక్కడ గదులు నిర్మాణం చేయడంతో పలువురు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హైడ్రా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి గదులను క్లియర్ చేసింది. దీంతో 300 గజాల స్థలాన్ని కాపాడినట్లు చెప్పారు. అలాగే వరద కాలువను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.