KDP: కలసపాడు మండల తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న మధురవాణి ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో రవీంద్రారెడ్డిని నియమించారు. ఆయన సోమవారం కలసపాడు MROగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సత్వర పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.