ASR: డుంబ్రిగుడ శాఖ గ్రంథాలయాన్ని జిల్లా ఛైర్మన్ వన్నెం రెడ్డి సతీష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠకులతో మాట్లాడి అందుబాటులో ఉన్న సౌకర్యాలను తెలుసుకున్నారు. గ్రంథాలయాన్ని పరిశీలించిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయంలో వైఫై సేవలను ఆధునీకరించనున్నట్లు తెలిపారు.