PLD: దళిత మహిళ కొనతం స్వాతికి న్యాయం చేయాలని కోరుతూ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు శనివారం సత్తెనపల్లి తాలూకా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళన చేపట్టారు. దళిత మహిళను కులం పేరుతో దూషించిన జనసేన నాయకుడు రంగిశెట్టి సుమన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.