W.G: కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 75 రోజులకుగాను స్వామివారి హుండీ లెక్కించగా రూ.16,61,147 వచ్చాయని దేవస్థానం ఈవో ఎం.అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమేశ్వరస్వామి దేవస్థానం ఈవో కూచంపూడి శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.