ADB: ఇంద్రవెల్లి మండలం పాటగూడలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకులాల కామన్ ఎంట్రన్స్ టెస్టు ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ పరీక్షకు విద్యార్థులు 219 మంది విద్యార్థులు హాజరైనట్లు.. 21 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.