TPT: తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె వీధిలో మంగళవారం పట్టపగలే చోరీ జరిగింది. పూల వ్యాపారం చేస్తున్న లీలమ్మ ఉదయం 9 గంటలకు బయట వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. తలుపులు బద్దలు కొట్టి ఉండడం చూసి దొంగలు పడ్డట్టు గుర్తించారు. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బీరువాలోని రూ.67 వేలు, 350 గ్రాముల వెండి నగలు కనిపించలేదు.