GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2015-16 నుంచి 2018-19 మధ్య స్వయం ఉపాధి రుణాలు పొందిన వారు ఈ నెల 30లోపు అసలు చెల్లిస్తే వడ్డీ పూర్తిగా మాఫీ చేస్తామని ఈడీ దుర్గాబాయి తెలిపారు. గడువు దాటితే అసలుతో పాటు వడ్డీ కట్టాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.