చిత్తూరు జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం తెలిపింది. రేపు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.