తనకు టీ20 సారథ్య బాధ్యతలు దక్కడం వెనుక టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ లేడని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు రాహుల్ ద్రవిడ్, అప్పటి బీసీసీఐ సెక్రటరీ జై షా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపాడు. గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టకముందే తనకు టీ20 కెప్టెన్సీ దక్కిందని స్పష్టం చేశాడు.