కృష్ణా: అటవీ శాఖ అవనిగడ్డ రేంజ్ అధికారిగా కే. కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. కొద్దిసేపు వారితో సమావేశమై తమ శాఖ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్ అధికారిణి నాగమణి, ఎఫ్.బీ.వో సత్యనారాయణ పాల్గొన్నారు.