MHBD: ఒంటి పూట బడులు ప్రారంభమైన నేపథ్యంలో పిల్లల జాగ్రత్తలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఇనుగుర్తి SI కరుణాకర్ సూచించారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల ముగిసిన తర్వాత చిన్నారులు చెరువులు, కుంటల వద్దకు ఈతకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆయన సూచించారు.