NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో రేపటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి రత్నం తెలిపారు. మండలంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ ఏయిడేట్ ప్రైవేట్ స్కూళ్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పారు. ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ఒంటిపూట బడులు నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.