AKP: పాయకరావుపేట మండలం నామవరం ‘అక్షరాంధ్ర’ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం కేంద్ర బృందం పరిశీలకుడు గగన్ కుమార్ కామత్ తనిఖీ చేశారు. మండలంలో మొత్తం 3,534 మంది అభ్యాసకులు పరీక్ష రాస్తున్నట్లు ఎంపీడీవో విజయలక్ష్మి ఆయనకు వివరించారు. 75 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఏపీవో నానిబాబు, వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.