AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆదివారం ఉదయం ఘనంగా శ్రీ కాళికామాత పండుగను నిర్వహించారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే పండుగలో పాల్గొనడానికి భక్తులు హాజరయ్యారు. కాళికామాతను డప్పు వాయిద్యాలు, బాణాసంచా పేలుళ్ల మధ్య ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారిని గుడివరకు ఊరేగింపుగా తీసుకువెళ్తారు. మధ్యాహ్నం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు.