TG: సీసీఐ పత్తి కొనుగోళ్ల గడువు ఈ నెలాఖరు వరకు పెంచారు. ఈనెల 20తో ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పందించి సీసీఐ సీఎండీతో మాట్లాడారు. ఎంపీ విజ్ఞప్తితో సానుకూలంగా స్పందించిన అధికారులు కొనుగోళ్లను మరో ఏడు రోజులు పొడిగించనున్నట్లు ప్రకటించారు.