కృష్ణా: రేషన్ బియ్యం అక్రమ రవాణాను కోడూరు పోలీసులు అడ్డుకున్నారు. అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన కరుణకుమార్ సుమారు రెండు వేల కేజీల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఐ చాణక్య తమ సిబ్బందితో కోడూరు మండలం వీ.కొత్తపాలెంలో అడ్డుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి, రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.