AKP: ఎలమంచిలికి కేజీబీవీని మంజూరు చేయాలని ఎంపీపీ రాజాన శేషు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించిన డీఈఓ అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.