AKP: కె.కోటపాడు మండలం దాలివలస గ్రామ సమీపంలోని జీడితోటల్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 11.30 గంటల సమయంలో మంటలు చెలరేగి సుమారు 4.5 ఎకరాల్లో తోటలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న సబ్బవరం అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. స్థానిక యువకులు, రైతులు సహాయపడ్డారు.