ఇటీవల అంధుల క్రికెట్లో టీమిండియా మెన్స్, ఉమెన్స్ జట్లు ప్రపంచకప్లను గెలిచాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో రెండు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ సదుపాయాలు, స్వదేశం వేదికగా జరిగే ద్వైపాక్షిక సిరీసుల్లో పాల్గొనే ప్లేయర్లకు వసతితో పాటు దేశవాళీ, అంతర్జాతీయ మ్యాచులు ఆడే సదుపాయం కల్పించనుంది.