TG: గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో విద్య, వైద్యం, విద్యుత్ సరఫరా, వ్యవసాయం, ఆర్టీసీ బస్సుల సౌకర్యం వంటి మౌలిక వసతులపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు అందాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.