MBNR: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా భూత్పూర్ మున్సిపాలిటీలో ఇవాళ పర్యటించారు. పట్టణంలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఆమె, ప్రజల ఆరోగ్యం పరిసరాల పరిశుభ్రతపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ఆదేశించారు.