MBNR: జడ్చర్లలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయంలో ఉర్దూ భాషలో బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై ముస్లిం మైనార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో ఉర్దూ మాట్లాడే వారు అధికంగా ఉన్నందున రెండో అధికార భాషను విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ వెంటనే ఉర్దూ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.