NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఈ నెల 27 నుంచి మే 7 వరకు పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇవాళ ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బిసి రాజారెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాండురంగ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని వారు బీసీ రాజారెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.