ELR: వట్లూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహం -1లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల ఆహార నాణ్యతను పరిశీలించారు. భోజనం పరిశుభ్రంగా ఉందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.