ADB: ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులు ముందుకు రావాలని ప్రధాన ఉపాధ్యాయుడు ఆనంద్ అన్నారు. తాంసి మండలంలోని కప్పర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని రిటైర్డ్ ఉపాధ్యాయుడు విలాస్ గురువారం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఆనంద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులున్నారు.