TG: కేంద్రం హోంమంత్రి అమిత్షాతో సీఎం రేవంత్ సమావేశం ముగిసింది. సుమారు గంట పాటు వీరి భేటీ జరిగింది. రాష్ట్ర పరిస్థితులు, మావోయిస్టు నేతల లొంగుబాటుపై వివరించారు. అలాగే రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కాగా, కేంద్రం తీసుకువచ్చిన ‘ఆపరేషన్ కగార్’తో మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే.